Navaratnalu

  • Contact us

AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు

April 17, 2023 by bharathi Leave a Comment

ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య : మిషన్ వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా అనాధ పిల్లల సంరక్షణ కొరకు ప్రారంభించబడిన ప్రత్యేక పథకం.

గతంలో ఉన్నటువంటి బాలల రక్షణ పథకం ( చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) ను 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మిషన్ వాత్సల్య పథకంతో అమలు చేస్తున్నారు. ఈ పథకం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేయబడుతుంది. ఇందులో కేంద్రం వాటా 60 శాతం రాష్ట్రాల వాటా 40 శాతం ఉంటుంది. కొన్ని ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో 90% కేంద్ర వాటా ఉంటుంది.

How-to-Apply-for-Mission-Vastsalya

ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఏమి అమలు చేస్తారు ?

రాష్ట్రాలు మరియు జిల్లాల భాగస్వామ్యంతో, పిల్లల కోసం 24×7 హెల్ప్‌లైన్ సేవను అమలు చేస్తుంది. (As per Juvenile Justice act 2015)

అనాధ పిల్లలు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంరక్షణ కొరకు శరణాలయాలు, ప్రత్యేక వసతి గృహాలను నిర్వహిస్తుంది.

దేశవ్యాప్తంగా పిల్లల దత్తతను CARA/SARA ఏజెన్సీల ద్వారా ప్రోత్సహిస్తుంది.

అదేవిధంగా అనాధ పిల్లలకు నెల కు ₹4000 ఆర్థిక సహాయాన్ని కూడా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.


మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు ?

కింద ఇవ్వబడిన ఏదైనా జాబితాలో 18 ఏళ్ల లోపు ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు అర్హులు

అనాథలుగా ఉంటూ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు

వితంతువు లేదా విడాకులు పొందిన తల్లి వద్ద ఉండే పిల్లలు
తల్లిదండ్రులు ప్రాణాపాయ/ ప్రాణాంతక వ్యాధికి గురై ఉండి, తల్లిదండ్రులు ఆర్థికంగా శారీరకంగా అసమర్థులు అయి పిల్లలను చూసుకోలేని వారు

జువైనల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలు ప్రకృతి వైపరీత్యానికి గురైన బాలలు,బాలకార్మికులు అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారు. బాల యాచకులు,వీధుల్లో నివసించే బాలలు, సహాయం, పునరావాసం అవసరమైన వారు, దోపిడీకి గురైన బాలలు
కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ‘సీఎం కేర్స్ ఫర్ పథకం కింద నమోదైన వారు.

Note:  తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకుని ఉన్న పిల్లలు కూడా అర్హులే అయితే వారి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 72000, పట్టణాల్లో అయితే 96000 మించారాదు. తల్లి విడాకులు పొందినా లేదా భర్త పూర్తిగా వదిలిపెట్టినట్లయితే మీ విఆర్వో నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి.

a) Rs. 72,000/- per annum for rural areas,
b) Rs. 96,000/- per annum for others.


మిషన్ వాత్సల్యకు దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్ లు ఏవి?

☛ బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం

☛ బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు

☛ తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము,మరణ కారణము

☛ తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్

☛ గార్డియన్ ఆధార్ కార్డు

☛ రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు

☛ కుల ధ్రువీకరణ పత్రము

☛ బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో

☛ స్టడీ సర్టిఫికేట్

☛ ఆదాయ ధ్రువీకరణ పత్రము (బ్రతికి ఉన్న తల్లి ది)

☛ బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.

Note: ఇద్దరు పిల్లలు ఉంటే రెండు అకౌంట్స్ తీసుకోవాలి.

ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి? ఎప్పటి వరకు అవకాశం ఉంది?

ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో అయితే మీ సమీప శిశు సంక్షేమ కార్యాలయంలో లేదా అంగన్వాడీ కేంద్రంలో సంప్రదించండి.

ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 30 చివరి తేదీ గా ఉందని  అధికారులు తెలిపారు. అనాధ పిల్లలను గుర్తించడంలో ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీలు, వాలంటీర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర బాలల హక్కు కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు వెల్లడించారు. సర్టిఫికెట్లు పొందటానికి కొంత సమయం పడుతున్న నేపథ్యంలో గడువు పెంపు కోసం కేంద్రాన్ని అభ్యర్థించినట్లు ఈ మేరకు కేంద్రం అంగీకరించినట్లు కేసలి అప్పారావు తెలిపారు.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Mission Vatsalya

Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు

April 17, 2023 by bharathi Leave a Comment

మిషన్ వాత్సల్య పథకం : తల్లిదండ్రులు లేని పిల్లలు గాని లేదా తల్లి గాని, తండ్రి గాని లేని పిల్లలు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్లకి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న అటువంటి పథకమే ఈ మిషన్ వాత్సల్య పథకం.

Mission-Vatsalya-Scheme-Date-Extended

ఈ పథకానికి సంబంధించి అర్హులైన వారు ఎవరైనా ఉంటే వాళ్లు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు మాత్రమే చివరి తేదీ ఇచ్చారు కానీ ఇప్పుడు దానిని పొడిగించారు ఏప్రిల్ 26వ తేదీ లాస్ట్ తేదీగా పడటం అయితే జరిగింది.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ పొడిగింపు : కానీ మిషన్ వాత్సల్య గడువు పొడిగింపు సర్టిఫికెట్లు పొందేందుకు గడువు కావాలని అభ్యర్థులు కోరిన నేపథ్యంలో గడువును ఈ నెల అనగా ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు తెలిపారు.

కాబట్టి అర్హులు ఎవరైనా ఉంటే ఈ మిషన్ వాత్సల్య పథకానికి ఏప్రిల్ 30వ తేదీ లోపల అప్లై చేసుకోవలెను.

ఇంకా ఎవరైనా సర్టిఫికెట్లు తీసుకోవడంలో ఆలస్యమై ఉంటే మీకు 30వ తేదీ వరకు గడువు అయితే ఉంది కావున అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలెను.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Mission Vatsalya

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in