Navaratnalu

  • Contact us

Pension News : పెన్షనర్లకు శుభవార్త | NPSలో మార్పులు తెస్తున్న మోదీ సర్కార్

February 24, 2023 by bharathi

Pension News: ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు తలెత్తిన పెద్ద సమస్య పెన్షన్ విధానం గురించే. పాత పెన్షన్ విధానం(OPS) కోసం డిమాండ్ పెరగడంతో.. కేంద్రం తన సంస్కరణల్లో భాగంగా జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) అమలుకు ప్రయత్నిస్తోంది. ఇది బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానానికి మెుగ్గు చూపటంతో కొంత రాజకీయ రంగును కూడా పులుముకుంది.

Modi Government Soon to Bring Changes in NPS As Alternate to Old Pension Scheme

కొత్త పెన్షన్ విధానం..
ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ భారం పడకుండా ఇప్పటికే ఉన్న పథకాన్ని సర్దుబాటు చేయడం ద్వారా NPS కింద ఉద్యోగి రిటైర్మెంట్ కి ముందు తీసుకున్న చివరి వేతనంలో 50 శాతాన్ని పెన్షన్ అందించాలనేది పరిగణలో ఉన్న ఒక అంశం. కొత్త విధానంలో ఉద్యోగి డిపాజిట్ చేసిన కార్పస్ లో 60 శాతం పదవీ విరమణ సమయంలో ఉపసంహరించుకోవటానికి అనుమతించబడుతుంది. మిగిలిన 40% యాన్యుటీలలో పెట్టుబడి పెట్టబడుతుంది. అంటే వారికి చివరగా తీసుకున్న జీతంలో దాదాపు 35%కి సమానమైన పెన్షన్‌ను అందిస్తుంది.

NPS సవరణ..
రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగి తన కంట్రిబ్యూషన్ 41.7% మొత్తాన్ని ఏకమొత్తంగా తిరిగి పొందే విధంగా NPSని సవరించవచ్చని అధికారులు లెక్కించారు. ఈ మోడల్‌తో ఉన్న ఏకైక సమస్య OPSలో కాకుండా, భవిష్యత్తులో పే కమీషన్ అవార్డుల కారణంగా ద్రవ్యోల్బణం మరియు ఇంక్రిమెంట్‌లకు సర్దుబాటు చేయడానికి కాలానుగుణంగా పెన్షన్‌ను సవరిస్తుంది.

బీజేపీ పాలించని రాష్ట్రాల్లో..
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లు 2022లో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత NPS కింద సేకరించబడిన కార్పస్‌ను కస్టడీకి తిరిగి ఇవ్వాలన్న డిమాండ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) తిరస్కరించింది. డబ్బు ఉపసంహరణకు చట్టం ఎలాంటి వెసులుబాటు కల్పించలేదని పేర్కొంది. దీంతో సదరు రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా విరాళాలను డిపాజిట్ చేయటం నిలిపివేశాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్ లలో ప్రభుత్వాలు సైతం ఎన్పీఎస్ అమలుకు దూరంగా ఉంటున్నాయి.

మార్పులు అవసరం..
కొత్త పెన్షన్ విధానంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి పరిష్కారాలను కనుగొనేందుకు ఉద్యోగులను సంప్రదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు పాత పెన్షన్ విధానం ప్రకారం ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మరణిస్తే బతికి ఉన్న వారి జీవిత భాగస్వామికి పెన్షనర్లకు చెల్లించినదానిలో సగం చెల్లిస్తున్నారు.

Filed Under: Pension

Higher Pension: అధిక పింఛనుకు అర్హులు ఎవరు?

February 23, 2023 by bharathi

సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చి.. అధికవేతనం పొందుతూ ఆ మేరకు ఈపీఎఫ్‌ చందాచెల్లిస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో అధిక పింఛను ప్రయోజనాలు కల్పించనుంది.

ఈపీఎఫ్‌ పింఛనుదారులు, ఉద్యోగుల్లో ఎన్నో సందేహాలు | నివృత్తి చేసిన ఈపీఎస్‌-95 సేవాగ్రూపు | ఈనాడు – హైదరాబాద్‌

సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చి.. అధికవేతనం పొందుతూ ఆ మేరకు ఈపీఎఫ్‌ చందాచెల్లిస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో అధిక పింఛను ప్రయోజనాలు కల్పించనుంది. ఈ తీర్పు అమలు కోసం ఇప్పటికే మూడు సర్క్యులర్లను ఈపీఎఫ్‌వో జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు? ఎవరికి అధిక పింఛను ప్రయోజనం వర్తిస్తుంది? తదితర సందేహాలు వస్తున్నాయి. ఈ మేరకు పింఛనుదారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకుని వివరాలు అడుగుతున్నారు. ఉద్యోగుల పింఛను పథకం-95పై తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో నిబంధనలపై పింఛనుదారుల సమాఖ్య అడిగిన సందేహాలను ఈపీఎఫ్‌వో-కోచి ప్రాంతీయ కార్యాలయం నివృత్తి చేసింది. ఈ వివరాలను ఈపీఎస్‌-95 సేవా గ్రూపు క్రోడీకరించింది.

2014 సెప్టెంబరు 1వ తేదీకి ముందు పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛనుకోసం దరఖాస్తు చేయవచ్చా?
దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆయా ఉద్యోగులు తాము సర్వీసులో ఉన్నపుడు ఈపీఎస్‌ చట్టం 11(3) నిబంధన కింద అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చి ఉండాలి. ఈ ఉమ్మడి ఆప్షన్‌ను ఈపీఎఫ్‌వో తిరస్కరించి ఉండాలి. ఈ అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు.

2014 సెప్టెంబరు 1న, ఆ తరువాత పదవీ విరమణ చేసిన వారు దరఖాస్తుకు అర్హులా?
అధిక పింఛను కోసం ఇప్పుడు ఆప్షన్‌ ఇవ్వవచ్చు. అయితే 2014 సెప్టెంబరు 1వ తేదీకి ముందు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వకుండా, ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి (బేసిక్‌+డీఏ)కి మించి వేతనం పొందుతూ ఉండాలి. వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తూ ఉండాలి.

ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు,  ఉద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చా?
2014 సెప్టెంబరు 1కి ముందు సభ్యులుగా చేరి, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే అధికవేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించాలి. 2014 సెప్టెంబరు 1 తరువాత చేరిన వారు అధిక పింఛను సదుపాయం వినియోగించుకోలేరు.

అధిక పింఛనుకు ఆప్షన్‌ ఇచ్చినపుడు ఈపీఎఫ్‌ చట్టంలో పేరా 26(6) నిబంధన కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాలన్నారు. ఇది ఏమిటి?
చట్టంలోని పేరా 26(6) ప్రకారం గరిష్ఠ పరిమితికి మించి వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించేందుకు ఈ నిబంధన వెసులుబాటు కల్పిస్తుంది. అధికవేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించేందుకు ముందుగా ఉద్యోగి, యజమాని కలిసి సంయుక్తంగా ఈపీఎఫ్‌వోకు దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తును ఏపీఎఫ్‌సీ ర్యాంకు.. ఆపై అధికారి ఆమోదించాలి. తాజాగా అధిక పింఛను కోరుకున్న ఉద్యోగులు 26(6) కింద ఆప్షన్‌ కచ్చితంగా ఇచ్చి ఉండాలి.

ఈపీఎస్‌ చట్టం -95 పేరా నం.11(3) కింద ఇచ్చిన ఆప్షన్‌ను చట్టసవరణ అనంతరం పేరా నం.11(4) కింద ఏడాదిలోగా పునరుద్ధరించలేదు. వారికి ఇప్పుడు అవకాశం ఉంటుందా?

చట్టసవరణ తరువాత ఏడాదిలోగా 11(4) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వని ఉద్యోగులు ఆ అవకాశాన్ని సొంతంగా వదులుకున్నట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అధిక పింఛనుకు ప్రస్తుతం ఉమ్మడి ఆప్షన్‌ అవకాశం లేదు.

ఉద్యోగుల పింఛనునిధి చట్టంలోని పేరా 11(3), 11(4) ఏం చెబుతోంది?
జవాబు: ఉద్యోగుల పింఛను నిధి (ఈపీఎస్‌) చట్టం – 1995ని 2014లో సవరించారు. ఈ చట్ట సవరణకు ముందు 11(3) నిబంధన ప్రకారం 1995 నవంబరు 16 నుంచి ఉద్యోగి పొందుతున్న వాస్తవిక వేతనం గరిష్ఠ వేతన పరిమితికి మించి ఉన్నప్పుడు మూలవేతనం, డీఏ మొత్తంలో 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు చందా చెల్లించాలి. ఈ మేరకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాలి. ఈ నిబంధనను 2014 సెప్టెంబరు 1 తరువాత ఈపీఎస్‌ చట్టసవరణ ద్వారా తొలగించింది. అయితే వాస్తవిక వేతనంపై గతంలో 8.33 శాతం చందా చెల్లిస్తున్న వారు ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్‌ ఇవ్వాలని 11(4) కింద అవకాశం ఇచ్చింది. ఈ గడువును మరో ఆరు నెలల పాటు ఈపీఎఫ్‌వో అప్పట్లో పొడిగించింది.

Filed Under: Pension

అధిక పింఛను శుభవార్త | A Higher Pension is Good News

February 21, 2023 by bharathi

అధిక పింఛను శుభవార్త | A Higher Pension is Good News

A Higher Pension is Good News

* వెసులుబాటు కల్పించిన ఈపీఎఫ్‌వో

* నాలుగు నెలల్లోగా

* అదనంగా చెల్లించాల్సిన మొత్తం, అధిక పింఛను లెక్కింపుపై తదుపరి ఆదేశాల్లో స్పష్టత!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిప్యనిధి పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను ప్రయోజనాలు పొందేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది. ఈపీఎఫ్‌వో విధించిన గరిష్ట వేతన పరిమితికి మించి వేతనాలు పొందుతూ.. ఆ మేరకు వేతనాల పై ఉద్యోగి, యజమాని

ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తున్న ఉద్యోగులకు ఈ అవకాశమిచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం-2014 చట్ట సవరణకు ముందు పేరా 11(3) కింద అధిక వేతనంపై అధిక పింఛను సదుపాయం కోసం ఉమ్మడి ఆప్షన్‌’ ఇవ్వలేక పోయిన వారందరికీ నాలుగు నెలల గడువు ఇచ్చింది. అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు, సుప్రీంకోర్టు తీర్పులోని పేరా 44(3), 44(4), 44(5)ల అమలులో భాగంగా ఈపీఎఫ్‌వో ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌-1(పింఛన్లు) అప్రజిత జగ్గీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల ఈపీఎస్‌లో డిపాజిట్‌

సర్దుబాటు, అదనపు చెల్లింపుల వివరాలు, అధిక పింఛను లెక్కింపు విధానంపై తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ కార్యాలయాల ఇన్‌ఛార్జులు వారానికోసారి దరఖాస్తుల పరిష్కార వివరాల్ని జోనల్‌ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జోనల్‌ కార్యాలయాలు వారానికోసారి కేంద్ర కార్యాలయ పింఛను డివిజన్‌కు వివరాలు అందించాలని తెలిపారు. యజమానితో కలిసి ఉద్యోగులు ఉమ్మడి ఐచ్ళికం ఇచ్చిన తరువాత ఏమైనా ఫిర్యాదులు “ఉంటే ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ (గ్రీవెన్స్‌) పోర్టల్‌ ద్వారా నమోదు చేయాలని సూచించారు.

గడువు తేదీ లేకపోవడంతో…

ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 11(8) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ట వేతన పరిమితి (టేసిక్‌+డీఏ) రూ. 6,500గా ఉంది. అంతకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌లో చేరేందుకు… ఆ వేతనంపై 8.8 శాతం పూర్తిగా ఈపీఎస్‌లో జమ చేయాలి. కానీ, ఈ పథకంలో చేరేందుకు అప్పట్లో గరిష్ట గడువు తేదీని పేర్కొనలేదు. 2014లో చట్ట సవరణ ద్వారా గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. చట్టసవరణకు ముందు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు… అధిక వేతనం వై ఈపీఎ! ఎస్‌లో చేతేందుకు ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్‌ ఇవ్వాలని ఈపీఎఫ్‌వో సూచించింది. అయితే, 2014 సవరణకు ముందు ఈ పథకంలో చేరని ఉద్యోగులకు ఆప్షన్‌ ఇచ్చే అవకాశాన్ని కల్పించలేదు. చట్ట సవరణకు ముందు కచ్చితమైన గడువు లేకపోవడంతో అర్హులైన ఉద్యోగుల్లో చాల్లామంది ఆప్షన్‌ ఇవ్వలేకపోయారని, వారికి మరోసారి నాలుగు నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆప్షన్‌కు అవకాశమిస్తూ ఈపీ ఎఫ్‌వో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఎవరు అర్హులు?

తాజా ఆదేశాల ప్రకారం… 2014 సవరణకు ముందు ఈపీఎఫ్‌ చట్టంలోని “పేరా 11(3) ప్రకారం అధిక వేతనంపై పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన చందాదారులు, చట్ట సవరణ తరువాత 11(4) కింద నిర్జీత గడువులోగా ఆప్షన్‌ సదుపాయాన్ని వినియోగించుకోలేకపోయిన ఉద్యోగులు తాజాగా ఆప్షన్‌ నమోదు చేయవచ్చు. ఇందుకు నాలుగు నెలల సమయం ఉంది.

2014 సెప్టెంబరు 1 నాటి చట్ట సవరణకు ముందు ఈపీఎఫ్‌ చందాదారులుగా ఉంటూ.. చట్టంలోని పేరా 28(6) ప్రకారం ఉద్యోగులు, యజమాని ఈపీఎఫ్‌ గరిష్ట వేతన పరిమితి (రూ.5 వేలు/రూ. 6,500) కన్నా ఎక్కువ వేతనంపై చందా చెల్లిస్తూ. 2014 సెప్టెంబరు 1 తరువాత కూడా సభ్యులుగా కొనసాగుతున్నవారు. అర్హులు. చట్ట సవరణకు ముందు 11(3) కింద యజమానితో కలిసి ఉమ్మడి ఐచ్ళికం ఇవ్వలేకపోయిన సభ్యులు అర్హులు.

చట్ట సవరణకు ముందు 118) ” కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చినప్పటికీ, సవరణ తరువాత 11/1) కింద అధీక పింఛనుకు ఆరు నెలల గడువులోగా ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన ఉద్యోగులెవరూ ప్రస్తుతం ఆప్షన్‌ ఇచ్చేందుకు అర్హులు కాదు.

దరఖాన్తు ప్రక్రీయ ఇలా…

అర్హులైనఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేయాలి. ఉమ్మడి ఆప్షన్ల దరఖాస్తు. విధానం, వివరాలు, గడువు తేదీని ప్రాంతీయ కమిషనర్‌ వెల్లడిస్తారు.

అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్య నిధి నుంచి పింఛను నిధికి అవసరమైన నగదు సర్దుబాటు, అదనపు నిధి డిపాజిట్‌ అంశంపై ఉమ్మడి ఆప్షన్‌ ఫారంలో కచ్చితంగా అంగీకారం తెలపాలి.

ఉద్యోగుల నుంచి ఈపీఎఫ్‌ను మినహాయిస్తున్న సంస్థలు భవిష్య నిధి ట్రస్ట్‌ నుంచి పింఛను నిధికి నగదు బదిలీ కోసం ట్రస్టీ నుంచి హామీపత్రం జతచేయాలి. నిధి సర్దు

బాటు సమయానికి ఈపీఎస్‌ చందా బకాయిలు, వడ్డీ సహా సకాలంలో చెల్లించేలా హామీపత్రంలో స్పష్టంగా పేర్కొనాలి.

ఉమ్మడి ఆప్షన్‌తోపాటు. అధిక వేతనంపై యజమాని చెల్లించిన వాటా జమకు సంబంధించిన ఆధారాలు, అధిక వేతనంపై పీఎఫ్‌ చెల్లించేందుకు అనుమతించాలని కోరుతూ గతంలో పేరా 260) కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌ రుజువును యజమాని ధ్రువీకరించాలి.

దరఖాస్తు కోసం త్వరలో ప్రత్యేకంగా లింకు(యూఆర్‌ఎల్‌)ను ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తీసుకురానుంది. అది అందుబాటు లోకి వచ్చిన తరువాత ప్రాంతీయ కమిషనర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్లో పూర్తి చేసి.. డిజిటల్‌గా పంపించాలి. దరఖాస్తుదారుడికి (ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. యజమాని లాగిన్‌కు దరఖాస్తు చేరుతుంది. దానిపై డిజిటల్‌ సంతకం చేసి… తదుపరి పరిష్కారానికి ప్రాంతీయ కమిషనర్‌కు సమర్పించాలి.

ప్రతి దరఖాస్తును ప్రాంతీయ కమిషనర్‌ ఈ-ఫైల్‌ కింద నమోదు చేసి, సంబంధిత సెక్షన్‌ సూపర్‌వైజర్‌కు బదిలీ చేస్తారు. సెక్షన్‌ అధికారులు… పింఛను నిధిలో బకాయిలు, ఇతర రిమార్కులు ఏమైనా ఉంటే నమోదు చేసి, అదనపు పీఎఫ్‌ ” కమిషన! ర్‌ లేదా ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌కు అందజేస్తారు.

ప్రతి కేసును ప్రాంతీయ లేదా అదనపు పీఎఫ్‌ కమిషనర్‌ పరిశీలించి పరిష్కార వివరాల్ని దర ఖాస్తుదారుడికి ఈ-మెయిల్‌/పోస్టు లేదా ఫోన్‌/ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు.

Filed Under: Pension

Higher pension: అధిక పింఛన్‌పై EPFO ప్రకటన. ఉమ్మడి ఆప్షన్‌కు ఓకే

February 21, 2023 by bharathi

EPFO on higher pension: అధిక పింఛన్‌కు సంబంధించి ఎట్టకేలకు ఈపీఎఫ్‌ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉమ్మడి ఆప్షన్‌ బాధ్యతను ప్రాంతీయ కార్యాలయాలకు అప్పగించింది.

EPFO Unveils Procedure to Apply for Higher Pension Under Employees Pension Scheme

epfo-unveils-procedure

దిల్లీ: ఉద్యోగుల పెన్షన్‌ పథకం (EPS) కింద అధిక పింఛన్‌ పొందే అంశంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు, సంస్థలకు ఉమ్మడి ఆప్షన్‌ అవకాశాన్ని కల్పించింది. అధిక పింఛన్‌ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి ఆప్షన్‌ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను ప్రాంతీయ కార్యాలయాలకు అప్పగించింది.

ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. 2014లో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచుతూ సవరణ చేసింది. అలాగే, గరిష్ఠ పరిమితితో సంబంధం లేకుండా అంతకుమించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌లో జమ చేసేందుకు అవకాశం కల్పించింది. అధికవేతనంపై ఈపీఎస్‌లో చేరేందుకు ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. అప్పట్లో దీనికి గడువేదీ పేర్కొనలేదు. అయితే, 2014 సవరణ నాటికి ఈ పథకంలో చేరని ఉద్యోగులు ఆప్షన్‌ ఇచ్చేందుకు ఈపీఎఫ్‌ఓ అంగీకరించలేదు. దీంతో అప్పుడు ఆప్షన్‌ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆప్షన్‌కు అవకాశం ఇస్తూ ఈపీఎప్‌ఓ ఉత్తర్వులు జారీ చేసింది. ఈపీఎఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయాలకు బాధ్యతలను అప్పగించింది. దీని ప్రకారం.

  • ఉమ్మడి ఆప్షన్‌కు సంబంధించి ప్రత్యేక యూఆర్‌ఎల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.
  • ఈ యూఆర్‌ఎల్‌ ద్వారా సభ్యులు డిజిటల్‌గా లాగిన్‌ అయ్యి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఇలా లాగిన్‌ అయిన వారు దరఖాస్తుదారుల రసీదు నంబర్‌ను కేటాయిస్తారు.
  • పీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయం ఆఫీసు ఇన్‌ఛార్జులు ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇన్‌ఛార్జుల నిర్ణయాన్ని ఈ-మెయిల్‌/పోస్ట్‌, ఎస్సెమ్మెస్‌ ద్వారా సభ్యులకు సమాచారం తెలియజేస్తారు.
  • ఉమ్మడి ఆప్షన్‌కు సంబంధించి దరఖాస్తు, పేమెంట్‌ బకాయిలు వంటి ఏవైనా ఫిర్యాదులు ఉంటే గ్రీవెన్స్‌ పోర్టల్‌ అయిన ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ (EPFiGMS)లో ఫిర్యాదు చేయొచ్చని ఈపీఎఫ్‌ఓ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

2022 నవంబర్‌ 4న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. సుప్రీం తీర్పును అనుసరించి అధిక పింఛన్‌కు ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాలని ప్రాంతీయ కార్యాలయాలకు సూచించింది. ఇందులో రెండు కేటగిరీ ఉద్యోగులు ఉన్నారు. 2014 సెప్టెంబర్‌1కి ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక పింఛనుకు ఆప్షన్‌ ఇచ్చినప్పటికీ గతంలో ఈపీఎఫ్‌ఓ తిరస్కరించిన వారు, వీరు ఒకటో కేటగిరీ కిందకి వస్తారు. సుప్రీం ఆదేశాలు అనంతరం డిసెంబర్‌లో వీరికి ఆప్షన్‌ ఇచ్చారు. 2014 ఆగస్టు 31 నాటికి ఈపీఎస్‌ సభ్యులుగా ఉండి అప్పట్లో ఆప్షన్‌ వినియోగించుకోని వారు రెండో కేటగిరీకి చెందిన వారు. వీరికి తాజాగా అవకాశం కల్పించారు. వీరు ఇప్పుడు అధిక పింఛన్‌ కోసం ఉమ్మడి ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

Filed Under: Pension

Pension Scheme: నెలకు రూ.9,250 పెన్షన్… చేరడానికి మార్చి 31 లాస్ట్ డేట్

February 14, 2023 by bharathi

Pension Scheme | కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓ పథకంలో చేరినవారికి నెలకు రూ.9,250 పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరడానికి మార్చి 31 లాస్ట్ డేట్. కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో ఇందులో పెట్టుబడి లిమిట్ Rs.7.5 లక్షలు ఉండగా, 2018 లో ఈ లిమిట్‌ను రూ.15 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు సామాజిక భద్రతను ఇవ్వడానికి, వారికి వడ్డీ ద్వారా ప్రతీ నెలా కొంత ఆదాయాన్ని అందించడానికి రూపొందించిన పెన్షన్పథకం (Pension Scheme) ఇది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ స్కీమ్‌కు ప్రభుత్వం ఎప్పటికప్పుడు గడువు విధిస్తూ ఉంటుంది. తాజా గడువు 2023 మార్చి 31 వరకే ఉంది.

pension-scheme-march-2023

ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకానికి వడ్డీని కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు 7.40 శాతం వడ్డీని అందిస్తోంది ఎల్ఐసీ . అంటే ఈ స్కీమ్‌లో చేరడం ద్వారా గరిష్టంగా నెలకు రూ.9,250 వరకు పెన్షన్ పొందొచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,62,162 ఇన్వెస్ట్ చేయాలి. వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, సంవత్సరానికి రూ.12,000 చొప్పున పెన్షన్ వస్తుంది.

ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో గరిష్టంగా రూ.15,00,000 పొదుపు చేయొచ్చు. 7.40 శాతం చొప్పున వడ్డీ లెక్కిస్తే నెలకు రూ.9,250 పెన్షన్ లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన భార్యాభర్తలు ఈ పెన్షన్ పథకంలో రూ.30,00,000 పొదుపు చేస్తే ఇద్దరికీ కలిపి రూ.18500 పెన్షన్ పొందొచ్చు. 2023 మార్చి 31 లోగా చేరేవారికే ఇంత మొత్తంలో పెన్షన్ లభిస్తుంది.

రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుల్ని దాచుకొని ప్రతీ నెలా వడ్డీ పొందాలనుకునేవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. లేదా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు వాటిని దాచుకొని ప్రతీ నెలా కొంత పెన్షన్ రూపంలో పొందాలనుకున్నా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఇందులో చేరడానికి కనీస వయస్సు 60 ఏళ్లు. గరిష్ట వయస్సుకు ఎలాంటి పరిమితి లేదు. పాలసీ టర్మ్ 10 ఏళ్లు.

ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో చేరిన వారికి ప్రతీ నెల పెన్షన్ వస్తుంది. ఇలా 10 ఏళ్ల పాటు పెన్షన్ పొందొచ్చు. 10 ఏళ్ల తర్వాత మొదట చెల్లించిన మొత్తం తిరిగి వస్తుంది. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే నామినీకి ముందుగా జమ చేసిన మొత్తాన్ని చెల్లిస్తుంది ఎల్ఐసీ.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Pension

  • 1
  • 2
  • Next Page »

Recent Posts

  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan
  • విద్యుత్‌ పీపీఏల టారిఫ్‌ | ఇక ఇదే రేటు | APERC Has Fixed Tariff Wind Power PPAS Beyond Ten Years
  • పాడి రైతుకు తోడు | In Addition to The Dairy Farmer
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా ప్రయోజనాలు మరియు ఇన్‌పుట్ సబ్సిడీని ఈరోజు విడుదల చేయనున్నారు
  • మొబైల్‌లో UAN నంబర్‌తో ఆన్‌లైన్‌లో PF బ్యాలెన్స్ చెక్, మిస్డ్ కాల్
  • 500 రూపాయల నోటు ఉన్నవారు: పెద్ద వార్త! 500 రూపాయల నోటుకు సంబంధించి RBI కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది, కొత్త మార్గదర్శకాలను తనిఖీ చేయండి, లేకపోతే…
  • ICICI బ్యాంక్ FD రేటు పెరిగింది: ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది, 15 నెలల FDపై 7.60% వడ్డీని ఇస్తుంది, తాజా రేట్లు తెలుసుకోండి.
  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద వార్త! ఈ 5 కారణాల వల్ల ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపగలదు, పూర్తి వివరాలు తెలుసుకోండి
  • డీఏ పెంపు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం: శుభవార్త! ఉద్యోగులకు 6% DA పెంపు మరియు పెన్షనర్లకు 6% DR ఉపశమనం, పూర్తి వివరాలు తెలుసుకోండి
  • PM కిసాన్ 13వ విడత 2023: PM కిసాన్ యోజన రూ. 2000ని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి, KYC స్థితి, ఖాతా బ్యాలెన్స్
  • హాస్టల్‌ విద్యార్థులకు శుభవార్త | Good news for hostel students
  • రైతులకు శుభవార్త : ఫిబ్రవరి 27న PM కిసాన్ విడుదల | లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా
  • PM Kisan 13th Installment: రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ | మరో రెండు రోజుల్లో ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు | డేట్ ఇదే?
  • నిరుద్యోగులకి శుభవార్త | ఈపీఎఫ్‌వో నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌..!
  • బెండపూడి విద్యార్లుల పై అసత్యప్రచారం తగదు | False propaganda against students of Bendapudi is not appropriate
  • Business Idea : డిమాండ్ తగ్గని వ్యాపారం.. రూ.2 లక్షల పెట్టుబడితో ప్రతీ నెల రూ.లక్ష ఆదాయం.. ఓ లుక్కేయండి
  • PAN Card: మీకు పాన్ కార్డ్ ఉందా | ఆ తప్పుతో జైలు కెళ్లాల్సిందే | ముందుగా జాగ్రత్త పడండి !
  • దేశంలో విపరీతంగా పెరిగిన ఇంటి అద్దెలు | హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా
  • Hyderabad Real Estate | సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ ని దున్నేస్తున్న హైదరాబాద్ | లేటెస్ట్ రిపోర్ట్
  • Hyderabad : పేదలకోసం బస్తీ దవాఖానాలు | మార్చి నుంచి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి
  • Telangana: బలహీన వర్గాల అభ్యున్నతికి KCR సర్కార్ ఊతం.. వేల కోట్లు ఖర్చు..
  • Telangana: డబుల్ బెడ్ రూం స్కీమ్ పై హరీష్ రావు క్లారిటీ | పేదలకు అండగా ఉంటామంటూ
  • Telangana : రికార్డులు సృష్టిస్తున్న కంటి వెలుగు | 25 రోజుల్లో 50 లక్షల మందికి లబ్ధి
  • Telangana: ఆస్తుల సృష్టిలో KCR ప్రభుత్వం అగ్రస్థానం.. తెలంగాణ అసాధారణ వృద్ధి..
  • Kadapa Steel Plant: రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ‘ఉక్కుపునాది’.. వేల మందికి ఉపాధి..
  • Andhra Pradesh: కేంద్రం దృష్టిని ఆకర్షించిన జగనన్న స్కీమ్ | OPS కంటే ఎక్కువ ప్రయోజనం
  • Pension News : పెన్షనర్లకు శుభవార్త | NPSలో మార్పులు తెస్తున్న మోదీ సర్కార్
  • No Income Tax: ఆ రాష్ట్ర ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు..! ఎందుకంటే..?
  • Andhra Pradesh: సీఎం జగన్ ముందుచూపు | పరిశ్రమల కోసం 48,352 ఎకరాల ల్యాండ్ బ్యాంక్
  • Higher Pension: అధిక పింఛన్‌పై EPFO ప్రకటన | ఉమ్మడి ఆప్షన్‌కు ఓకే
  • EPFO: యూఏఎన్‌ నంబరు గుర్తులేదా? ఇలా తెలుసుకోవచ్చు..
  • New Rules: NPS విత్‌డ్రాలో మార్పులు.. పాలసీలకు కేవైసీ.. రేపటి నుంచే!

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in