Navaratnalu

  • Contact us

80 వేల రేషన్‌కార్డులు రద్దు.. కారణం? | 80 THOUSAND RATION CARDS ARE CANCELLED WHY ? REASON

February 20, 2023 by bharathi

రేషన్ కార్డులనేవి ఒక కుటుంబానికి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్. రేషన్ కార్డు లేకుంటే ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందవు. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎలాగో రేషన్ కార్డు కూడా అంతే ముఖ్యం. రేషన్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహస్తోంది.అసలు ఎలాంటి అర్హత లేకుండా రేషన్‌ కార్డులు పొందుతూ ఉచితంగా రేషన్‌ తీసుకుంటున్నవారిపై ప్రత్యేక నిఘా పెంచింది కేంద్ర ప్రభుత్వం.అందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రకాల చర్యలు చేపడుతున్నాయి.

80-THOUSAND-RATION-CARDS-ARE-CANCELLED-WHY

రేషన్‌కార్డుదారుల పొరపాటు వల్ల మొత్తం 80 వేల కార్డులు రద్దయ్యాయి. నిజానికి కార్డుదారులు ఆరు నెలల పాటు నిరంతరం రేషన్ కనుక తీసుకోకపోతే అతని పేరును ప్రభుత్వం జాబితా నుండి తొలగిస్తుంది. దాని స్థానంలో మరో నిరుపేద వ్యక్తికి రేషన్‌కార్డుని తయారు జారీ చేస్తారు.

ఇక గోవా ప్రభుత్వం అయితే ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారి రేషన్ కార్డును రద్దు చేసింది. ఈ కార్డ్ హోల్డర్లు ఆగస్టు 2022 నుండి జనవరి 2023 దాకా తమ రేషన్ తీసుకోలేదు. రేషన్ తీసుకోని కార్డుదారుల కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలు ఇంకా అలాగే వినియోగదారుల వ్యవహారాల డైరెక్టర్ గోపాల్ పర్సేకర్ తెలిపారు. దీనితో పాటు ఇంత పెద్ద సంఖ్యలో కార్డుదారులు రేషన్ ఎందుకు తీసుకోలేదో కూడా డిపార్ట్‌మెంట్ విచారణ చేస్తోందని ఆయన చెప్పారు.

ఇక రాష్ట్రంలో మొత్తం 13.32 లక్షల మంది రేషన్ కార్డుదారులున్నారు. వీరిలో మొత్తం 80 వేల మంది రేషన్ కార్డుదారులకు రేషన్ తీసుకోకపోవడం పెద్ద విషయమే అయినా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది ఎందుకు రేషన్ తీసుకోలేదని శాఖాపరంగా విచారణ అనేది జరుగుతోంది. తమ సమ్మతి ఆధారంగా కార్డును రద్దు చేయాలని అభ్యర్థించిన వారు తమ కార్డును మళ్లీ జారీ చేసుకోవచ్చని కూడా పర్సేకర్ చెప్పారు.

Filed Under: Rice Card

e-Ration Card : ఎలాంటి కార్డు చూపెట్టకుండానే ఈజీగా రేషన్ తీసుకోవచ్చు | అదెలాగో తెలుసుకోండి

February 18, 2023 by bharathi

దేశంలోని అధిక భాగం ప్రజలు ఇప్పటికీ ఇంటి నిర్వహణకు రేషన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం తక్కువ ధరకు రేషన్ అందజేస్తుంది. ఈ రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డు గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు.

DIGITAL RATION CARD KNOW HOW TO DOWNLOAD E RATION CARD AND HOW TO USE IT

దేశంలోని అధిక భాగం ప్రజలు ఇప్పటికీ ఇంటి నిర్వహణకు రేషన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం తక్కువ ధరకు రేషన్ అందజేస్తుంది. ఈ రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే రేషన్ వినియోగదారుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఈ-రేషన్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఈ-రేషన్ కార్డ్ ఈనాటి సేవ కాదు. ఈ రేషన్ కార్డు సేవను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టింది. తొలి దశలో ఢిల్లీలో ఈ-రేషన్ కార్డు సదుపాయాన్ని తీసుకువచ్చారు. ఆ తరువాత ఈ రేషన్ కార్డు సేవ ఇతర రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టారు.

రేషన్ కార్డుల పంపిణీ సమస్యను మరింత సులభం చేయడానికి ఈ-రేషన్ కార్డ్ సర్వీస్ ను ప్రారంభించారు. రేషన్ కార్డుతో ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ అనుసంధానం అయి ఉన్న వారు ఈ-రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇ-రేషన్ కార్డు పొందిన తర్వాత మీరు రేషన్‌ను తీసుకోవడానికి కార్డు లేదా ఎలాంటి పత్రాలను చూపించాల్సిన అవసరం లేదు. సులభంగా రేషన్‌ను తీసుకోవచ్చు.

రేషన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..? ప్రతి రాష్ట్రం సొంత ప్రజా పంపిణీ వ్యవస్థ వెబ్‌సైట్‌ను కలిగి ఉంది. రేషన్ కార్డుకు సంబంధించిన మొత్తం సమాచారం nfsa.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ప్రింట్ రేషన్ కార్డ్ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ నంబర్, ఇతర వివరాలను ఫారమ్‌లో నింపండి.

ఇప్పుడు మీ ఇ-రేషన్ కార్డ్ అప్లికేషన్ PDS ద్వారా చెక్ అవుతుంది. ధృవీకరణ పూర్తయిన తర్వాత, అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, కార్డ్ స్థితిని చూడటానికి రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.

కార్డ్ జనరేట్ అయితే, మీరు వెబ్‌సైట్ నుండి కార్డ్ ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు..

Filed Under: Rice Card

Rice Card Update 2023 | Changes in Ration Cards

February 14, 2023 by bharathi

రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. కానీ కొత్త కార్డు కావాలన్నా, మార్పు జరగాలన్నా వివిధ రకాల ధ్రువపత్రాలు, అనుబంధ పత్రాలు కోరడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారు.

Changes-in-Ration-Cards-2023

* పార్వతీపురానికి చెందిన ఎస్‌.మనోజ్‌కుమార్‌ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇటీవల తన రేషన్‌ కార్డులో భార్య పేరు చేర్చడానికి వివాహ ధ్రువపత్రంతో సచివాలయానికి వెళ్లగా హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో ఆమె పేరు లేదని, ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తినే చేర్చగలమని చెప్పడంతో వెనుదిరిగారు. ఉన్నతాధికారులను సంప్రదించగా ఆ రాష్ట్ర ఆధార్‌తో అనుసంధానించి పేరు చేర్చాలని సిఫార్సు చేశారు.


* గరుగుబిల్లి మండలం గొట్టివలసకు చెందిన రాము తాపీమేస్త్రి. ఇతనికి జియ్యమ్మవలస మండలానికి చెందిన యువతితో ఏడేళ్ల కిందట  వివాహమైంది. తన కార్డులో భార్య, పిల్లల పేర్లు చేర్చాలని చూడగా వివాహ ధ్రువపత్రం కోరారు. దీని కోసం సబ్‌రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లగా వయసు నిర్ధారణకు ఆధార్‌తో పాటు స్టడీ సర్టిఫికెట్‌ అడిగారు. దానిని 1998 లో చదివిన పాఠశాలకు వెళ్లి తీసుకొచ్చారు.


* పార్వతీపురం మండలం డోకిశీలకు చెందిన ఓ వ్యక్తి, అతని భార్య విడిపోయి 15 ఏళ్లయింది. కానీ ఇద్దరి పేర్లు ఒకే రేషన్‌కార్డులో ఉన్నాయి. ఇటీవల ఆమె పేరు తొలగించాలని దరఖాస్తు చేసుకోగా ఇద్దరు విడిపోయినట్లు కోర్టు ఇచ్చిన విడాకుల పత్రాలు తీసుకురావాలన్నారు. దీంతో ఆయన న్యాయవాదిని సంప్రదించాల్సి వచ్చింది.


* కొమరాడ మండలం బంజుకుప్పకు చెందిన శ్రీహరి, రాణి దంపతులు. వారికి రేషన్‌కార్డు కావాలని అధికారుల వద్దకు వెళ్లగా వివాహ ధ్రువపత్రం అడిగారు. దాని కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లగా వయసు నిర్ధారణ కోసం పదో తరగతి ధ్రువపత్రం కోరారు. అమ్మాయి చదువుకోకపోవడంతో వయసు నిర్ధారణ పత్రం అడిగారు. దీనికోసం పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా ఇక్కడ నిపుణులు లేక విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె ఐదు రోజులుగా తిరుగుతోంది.

Eligible-persons-who-come-for-certificates-at-Sub-Registrar-office

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి  ధ్రువపత్రాల   కోసం వచ్చిన అర్హులు

పార్వతీపురం, బెలగాం, న్యూస్‌టుడే: రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. కానీ కొత్త కార్డు కావాలన్నా, మార్పు జరగాలన్నా వివిధ రకాల ధ్రువపత్రాలు, అనుబంధ పత్రాలు కోరడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారు. కార్డు వస్తుందో లేదో తెలియదు కానీ రోజుల కొద్దీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.


గతంలో ఇలా..

* కార్డులో మార్పులకు పెట్టుకున్న దరఖాస్తులను సంబంధిత వీఆర్వోలు పరిశీలించి, నివాస ధ్రువపత్రం మంజూరు చేసేవారు. దీన్ని సంబంధిత కార్యాలయంలో సమర్పిస్తే కుటుంబ సభ్యులుగా గుర్తించి కార్డులో చేర్చేవారు.
* పేరు తొలగించాల్సి వస్తే అందుకు అవసరమైన కారణాలను నిర్ధారించే ధ్రువపత్రం సమర్పిస్తే పని  పూర్తయ్యేది.
ఎన్నో అడ్డంకులు
* భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలకు ప్రభుత్వం పథకాలు అందిస్తోంది. వీటిని పొందాల్సిన వారికి ఒంటరిగా ఉన్నట్లు రేషన్‌కార్డు కావాలి. కానీ చాలా మందికి భర్తతో కలిసి ఉన్న కార్డులే ఉన్నాయి. కొత్త దాని కోసం వెళ్తే విడాకుల ధ్రువపత్రం అడుగుతున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో విడిపోయిన వారికి పత్రాలు తీసుకురావడం భారంగా మారుతోంది.
* కొత్తగా పెళ్లయిన వారి పేర్లను కార్డుల్లో చేర్చాలంటే ధ్రువపత్రం కావాలి. వివాహమై ఏడేళ్లు గడిచిన వారి పేరు చేర్చాలంటే ఇంటింటి సర్వేలో మ్యాపింగ్‌ జరిగి ఉండాలని చెబుతున్నారు. దీని కోసం వివాహ ధ్రువపత్రం అవసరం. మన్యం ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు చేసుకునే అలవాటు లేకపోవడంతో కొందరు అవస్థలు పడుతున్నారు.


అదనపు ఖర్చు

* వివాహ ధ్రువపత్రం కావాలంటే ప్రభుత్వ చలానాగా రూ.200 చెల్లించాలి. కానీ బయట ఖర్చులు రూ.2 వేల వరకు అవుతున్నట్లు పలువురు చెబుతున్నారు.
* పెళ్లై ఎక్కువ సంవత్సరాలు అయిన వారికి పత్రాలు కావాలంటే దంపతుల విద్యార్హత, స్టడీ సర్టిఫికెట్లు, పెళ్లి ఫొటో, ఆహ్వాన పత్రిక జతచేయాల్సి ఉంటుంది.
* నిరక్షరాస్యులకు వయసు నిర్ధారణ పత్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఎముకల వైద్యుల నుంచి తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో వీరు లేకపోవడంతో విజయనగరం, విశాఖకు వెళ్లాల్సిన పరిస్థితి. దీని కోసం రూ.వేలల్లో ఖర్చవుతున్నట్లు చెబుతున్నారు. గతంలో పంచాయతీ కార్యాలయంలో పూర్తయ్యే పనుల కోసం ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది.

సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల వద్ద వివాహ ధ్రువపత్రాల కోసం విదేశాలకు వెళ్లే వారు తప్ప ఇతరులు కనిపించరు. ప్రస్తుతం రేషన్‌ కార్డు కోసం వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జతచేయాల్సి ఉండటంతో భారీగా వస్తున్నారు.


నిబంధనల మేరకు

రేషన్‌ కార్డుల విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను ప్రభుత్వం తెలియజేసింది. సంబంధిత ధ్రువపత్రాలు ముందుగా సమర్పిస్తే ఎక్కడా తిరగాల్సిన అవసరం ఉండదు. పత్రాలు లేకపోతే సంబంధిత నోటరీని సమర్పించే వెసులుబాటు కల్పించారు.

కేవీఎల్‌ఎన్‌ మూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి, పార్వతీపురం మన్యం


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Rice Card

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వం!

February 11, 2023 by bharathi

The government has given good news to the ration card holders in AP : నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం అందించే రేషన్ తో మూడు పూటలా తిండి తినగలుగుతున్నారడంలో అతిశయోక్తి లేదు. పేద వర్గాలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యం అనే చెప్పాలి. రేషన్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడం కోసం రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. కరోనా కష్టకాలంలో రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

good news for rice card holders-in-andhra-pradesh

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారని.. రైతుల నుంచి ప్రతి దాన్యపు గింజ కొనుగోలు చేస్తామని ఎలాంటి అందోళన అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో రైతుల నుంచి దాన్యం సేకరణ నుంచి ప్రజలకు రేషన్ పంపిణీ వరకు అన్నింటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కమాన్ కంట్రోల్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తుందని ఇప్పుడు గోధుమ పిండి కూడా చేర్చుతుందని అన్నారు.

రేషన్ కార్డుదారులు అడిగితే నెలకు ఒక్కో కుటుంబానికి 2 కిలోల చొప్పున కందిపప్పు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పు ఇస్తున్నామని.. కానీ వారు తీసుకోవడం లేదని అన్నారు. త్వరలో చిరుధాన్యాల పంపిణీ కూడా మొదలు పెడతామని.. అలాగే గోధుమ పిండి పంపిణీ రాష్ట్రమంతటా విస్తరిస్తామని అన్నారు మంత్రి కారుమూరి. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి దాన్యం లోడింగ్ నుంచి గోదాములకు పంపడం సహా సీసీ కెమెరాల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని ఆయన అన్నారు. అంతేకాదు ఎండియూ వాహనాలు సరిగా పనిచేస్తున్నాయా అన్న విషయాలపై దృష్టి సారిస్తున్నామని అన్నారు. ఏపిలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు భేష్ అని ప్రశంసలు వస్తున్నాయని మంత్రి అన్నారు.

Filed Under: Rice Card

AP Ration Card Holders Good News | Key Announcement | రెండు కిలోలకు ఛాన్స్

February 9, 2023 by bharathi

Ap Ration Shops కు సంబంధించి ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే గోధుమపిండి పంపిణీని కొన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని రేషన్ షాపుల్లో పంపిణీకి విస్తరిస్తామని.. అలాగే రాగులు, జొన్నలు కూడా పంపిణీని కూడా మొదలు పెడతామన్నారు. రాష్ట్రంలో ఇకపై ధాన్యం లోడింగ్ నుంచి గోదాములకు వెళ్లే వరకు పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎండీయూ వాహనాలు ఎక్కడున్నాయో ట్రాక్ చేస్తారు.

AP-Ration-Card-Holders-Good-News

ప్రధానాంశాలు:

  • ఏపీలో రేషన్ షాపులకు సంబంధించి కీలక ప్రకటన
  • త్వరలోనే గోధుమ పిండి పంపిణీ రాష్ట్రమంతా విస్తరణ
  • రాగులు, జొన్నలు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు

రెండు వారాల్లో చిరుధాన్యాల పంపిణీ మొదలు పెడతామంటున్నారు పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. గోధుమపిండి పంపిణీని రాష్ట్రమంతటా విస్తరిస్తామని.. రేషన్‌ కార్డుదారులు కోరితే నెలకు ఒక్కో కుటుంబానికి 2 కిలోల చొప్పున కందిపప్పు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ప్రస్తుతం కిలో చొప్పున ఇస్తున్న కందిపప్పునే వారు తీసుకోవడం లేదన్నారు. మంత్రి విజయవాడలో సివిల్‌ సప్లై కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించారు.

ధాన్యం సరఫరా ఎలా జరుగుతుందో మానిటర్‌ చేయడానికే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు నాగేశ్వరరావు. ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుందని.. అన్ని సివిల్‌ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్‌తో ట్రాక్ చేస్తామన్నారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ నుంచి ధాన్యం లోడింగ్‌ నుంచి రవాణా, మిల్లుల్లో మర ఆడించి గోదాములకు పంపడం వరకు అన్నీ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే ఎండీయూ వాహనాలు ఎక్కడున్నాయి.. ఇంటింటికి వెళ్తున్నాయో లేదో కూడా తెలిసేలా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి.

రాష్ట్రంలో రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని.. ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు నాగేశ్వరరావు. మార్క్‌ఫెడ్‌ దగ్గర అదనంగా సొమ్ము ఉన్నందునే ఆ సంస్థ నుంచి రూ.3,200 కోట్లను అప్పుగా తీసుకున్నామని.. సివిల్‌ సప్లైలో అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమన్నారు. ఖరీఫ్‌లో దళారులు, మిల్లర్లకు సంబంధం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని బాగా సేకరించారని సీఎం ప్రశంసించారన్నారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Rice Card

  • 1
  • 2
  • Next Page »

Recent Posts

  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan
  • విద్యుత్‌ పీపీఏల టారిఫ్‌ | ఇక ఇదే రేటు | APERC Has Fixed Tariff Wind Power PPAS Beyond Ten Years
  • పాడి రైతుకు తోడు | In Addition to The Dairy Farmer
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా ప్రయోజనాలు మరియు ఇన్‌పుట్ సబ్సిడీని ఈరోజు విడుదల చేయనున్నారు
  • మొబైల్‌లో UAN నంబర్‌తో ఆన్‌లైన్‌లో PF బ్యాలెన్స్ చెక్, మిస్డ్ కాల్
  • 500 రూపాయల నోటు ఉన్నవారు: పెద్ద వార్త! 500 రూపాయల నోటుకు సంబంధించి RBI కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది, కొత్త మార్గదర్శకాలను తనిఖీ చేయండి, లేకపోతే…
  • ICICI బ్యాంక్ FD రేటు పెరిగింది: ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది, 15 నెలల FDపై 7.60% వడ్డీని ఇస్తుంది, తాజా రేట్లు తెలుసుకోండి.
  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద వార్త! ఈ 5 కారణాల వల్ల ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపగలదు, పూర్తి వివరాలు తెలుసుకోండి
  • డీఏ పెంపు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం: శుభవార్త! ఉద్యోగులకు 6% DA పెంపు మరియు పెన్షనర్లకు 6% DR ఉపశమనం, పూర్తి వివరాలు తెలుసుకోండి
  • PM కిసాన్ 13వ విడత 2023: PM కిసాన్ యోజన రూ. 2000ని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి, KYC స్థితి, ఖాతా బ్యాలెన్స్
  • హాస్టల్‌ విద్యార్థులకు శుభవార్త | Good news for hostel students
  • రైతులకు శుభవార్త : ఫిబ్రవరి 27న PM కిసాన్ విడుదల | లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా
  • PM Kisan 13th Installment: రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ | మరో రెండు రోజుల్లో ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు | డేట్ ఇదే?
  • నిరుద్యోగులకి శుభవార్త | ఈపీఎఫ్‌వో నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌..!
  • బెండపూడి విద్యార్లుల పై అసత్యప్రచారం తగదు | False propaganda against students of Bendapudi is not appropriate
  • Business Idea : డిమాండ్ తగ్గని వ్యాపారం.. రూ.2 లక్షల పెట్టుబడితో ప్రతీ నెల రూ.లక్ష ఆదాయం.. ఓ లుక్కేయండి
  • PAN Card: మీకు పాన్ కార్డ్ ఉందా | ఆ తప్పుతో జైలు కెళ్లాల్సిందే | ముందుగా జాగ్రత్త పడండి !
  • దేశంలో విపరీతంగా పెరిగిన ఇంటి అద్దెలు | హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా
  • Hyderabad Real Estate | సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ ని దున్నేస్తున్న హైదరాబాద్ | లేటెస్ట్ రిపోర్ట్
  • Hyderabad : పేదలకోసం బస్తీ దవాఖానాలు | మార్చి నుంచి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి
  • Telangana: బలహీన వర్గాల అభ్యున్నతికి KCR సర్కార్ ఊతం.. వేల కోట్లు ఖర్చు..
  • Telangana: డబుల్ బెడ్ రూం స్కీమ్ పై హరీష్ రావు క్లారిటీ | పేదలకు అండగా ఉంటామంటూ
  • Telangana : రికార్డులు సృష్టిస్తున్న కంటి వెలుగు | 25 రోజుల్లో 50 లక్షల మందికి లబ్ధి
  • Telangana: ఆస్తుల సృష్టిలో KCR ప్రభుత్వం అగ్రస్థానం.. తెలంగాణ అసాధారణ వృద్ధి..
  • Kadapa Steel Plant: రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ‘ఉక్కుపునాది’.. వేల మందికి ఉపాధి..
  • Andhra Pradesh: కేంద్రం దృష్టిని ఆకర్షించిన జగనన్న స్కీమ్ | OPS కంటే ఎక్కువ ప్రయోజనం
  • Pension News : పెన్షనర్లకు శుభవార్త | NPSలో మార్పులు తెస్తున్న మోదీ సర్కార్
  • No Income Tax: ఆ రాష్ట్ర ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు..! ఎందుకంటే..?
  • Andhra Pradesh: సీఎం జగన్ ముందుచూపు | పరిశ్రమల కోసం 48,352 ఎకరాల ల్యాండ్ బ్యాంక్
  • Higher Pension: అధిక పింఛన్‌పై EPFO ప్రకటన | ఉమ్మడి ఆప్షన్‌కు ఓకే
  • EPFO: యూఏఎన్‌ నంబరు గుర్తులేదా? ఇలా తెలుసుకోవచ్చు..
  • New Rules: NPS విత్‌డ్రాలో మార్పులు.. పాలసీలకు కేవైసీ.. రేపటి నుంచే!

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in