అధిక పింఛను శుభవార్త | A Higher Pension is Good News
* వెసులుబాటు కల్పించిన ఈపీఎఫ్వో
* నాలుగు నెలల్లోగా
* అదనంగా చెల్లించాల్సిన మొత్తం, అధిక పింఛను లెక్కింపుపై తదుపరి ఆదేశాల్లో స్పష్టత!
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిప్యనిధి పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను ప్రయోజనాలు పొందేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది. ఈపీఎఫ్వో విధించిన గరిష్ట వేతన పరిమితికి మించి వేతనాలు పొందుతూ.. ఆ మేరకు వేతనాల పై ఉద్యోగి, యజమాని
ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న ఉద్యోగులకు ఈ అవకాశమిచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం-2014 చట్ట సవరణకు ముందు పేరా 11(3) కింద అధిక వేతనంపై అధిక పింఛను సదుపాయం కోసం ఉమ్మడి ఆప్షన్’ ఇవ్వలేక పోయిన వారందరికీ నాలుగు నెలల గడువు ఇచ్చింది. అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు, సుప్రీంకోర్టు తీర్పులోని పేరా 44(3), 44(4), 44(5)ల అమలులో భాగంగా ఈపీఎఫ్వో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్-1(పింఛన్లు) అప్రజిత జగ్గీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల ఈపీఎస్లో డిపాజిట్
సర్దుబాటు, అదనపు చెల్లింపుల వివరాలు, అధిక పింఛను లెక్కింపు విధానంపై తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ కార్యాలయాల ఇన్ఛార్జులు వారానికోసారి దరఖాస్తుల పరిష్కార వివరాల్ని జోనల్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జోనల్ కార్యాలయాలు వారానికోసారి కేంద్ర కార్యాలయ పింఛను డివిజన్కు వివరాలు అందించాలని తెలిపారు. యజమానితో కలిసి ఉద్యోగులు ఉమ్మడి ఐచ్ళికం ఇచ్చిన తరువాత ఏమైనా ఫిర్యాదులు “ఉంటే ఈపీఎఫ్ఐజీఎంఎస్ (గ్రీవెన్స్) పోర్టల్ ద్వారా నమోదు చేయాలని సూచించారు.
గడువు తేదీ లేకపోవడంతో…
ఈపీఎఫ్ చట్టంలోని పేరా 11(8) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ట వేతన పరిమితి (టేసిక్+డీఏ) రూ. 6,500గా ఉంది. అంతకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్లో చేరేందుకు… ఆ వేతనంపై 8.8 శాతం పూర్తిగా ఈపీఎస్లో జమ చేయాలి. కానీ, ఈ పథకంలో చేరేందుకు అప్పట్లో గరిష్ట గడువు తేదీని పేర్కొనలేదు. 2014లో చట్ట సవరణ ద్వారా గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. చట్టసవరణకు ముందు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు… అధిక వేతనం వై ఈపీఎ! ఎస్లో చేతేందుకు ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్ ఇవ్వాలని ఈపీఎఫ్వో సూచించింది. అయితే, 2014 సవరణకు ముందు ఈ పథకంలో చేరని ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించలేదు. చట్ట సవరణకు ముందు కచ్చితమైన గడువు లేకపోవడంతో అర్హులైన ఉద్యోగుల్లో చాల్లామంది ఆప్షన్ ఇవ్వలేకపోయారని, వారికి మరోసారి నాలుగు నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆప్షన్కు అవకాశమిస్తూ ఈపీ ఎఫ్వో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరు అర్హులు?
తాజా ఆదేశాల ప్రకారం… 2014 సవరణకు ముందు ఈపీఎఫ్ చట్టంలోని “పేరా 11(3) ప్రకారం అధిక వేతనంపై పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన చందాదారులు, చట్ట సవరణ తరువాత 11(4) కింద నిర్జీత గడువులోగా ఆప్షన్ సదుపాయాన్ని వినియోగించుకోలేకపోయిన ఉద్యోగులు తాజాగా ఆప్షన్ నమోదు చేయవచ్చు. ఇందుకు నాలుగు నెలల సమయం ఉంది.
2014 సెప్టెంబరు 1 నాటి చట్ట సవరణకు ముందు ఈపీఎఫ్ చందాదారులుగా ఉంటూ.. చట్టంలోని పేరా 28(6) ప్రకారం ఉద్యోగులు, యజమాని ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి (రూ.5 వేలు/రూ. 6,500) కన్నా ఎక్కువ వేతనంపై చందా చెల్లిస్తూ. 2014 సెప్టెంబరు 1 తరువాత కూడా సభ్యులుగా కొనసాగుతున్నవారు. అర్హులు. చట్ట సవరణకు ముందు 11(3) కింద యజమానితో కలిసి ఉమ్మడి ఐచ్ళికం ఇవ్వలేకపోయిన సభ్యులు అర్హులు.
చట్ట సవరణకు ముందు 118) ” కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినప్పటికీ, సవరణ తరువాత 11/1) కింద అధీక పింఛనుకు ఆరు నెలల గడువులోగా ఆప్షన్ ఇవ్వలేకపోయిన ఉద్యోగులెవరూ ప్రస్తుతం ఆప్షన్ ఇచ్చేందుకు అర్హులు కాదు.
దరఖాన్తు ప్రక్రీయ ఇలా…
అర్హులైనఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేయాలి. ఉమ్మడి ఆప్షన్ల దరఖాస్తు. విధానం, వివరాలు, గడువు తేదీని ప్రాంతీయ కమిషనర్ వెల్లడిస్తారు.
అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్య నిధి నుంచి పింఛను నిధికి అవసరమైన నగదు సర్దుబాటు, అదనపు నిధి డిపాజిట్ అంశంపై ఉమ్మడి ఆప్షన్ ఫారంలో కచ్చితంగా అంగీకారం తెలపాలి.
ఉద్యోగుల నుంచి ఈపీఎఫ్ను మినహాయిస్తున్న సంస్థలు భవిష్య నిధి ట్రస్ట్ నుంచి పింఛను నిధికి నగదు బదిలీ కోసం ట్రస్టీ నుంచి హామీపత్రం జతచేయాలి. నిధి సర్దు
బాటు సమయానికి ఈపీఎస్ చందా బకాయిలు, వడ్డీ సహా సకాలంలో చెల్లించేలా హామీపత్రంలో స్పష్టంగా పేర్కొనాలి.
ఉమ్మడి ఆప్షన్తోపాటు. అధిక వేతనంపై యజమాని చెల్లించిన వాటా జమకు సంబంధించిన ఆధారాలు, అధిక వేతనంపై పీఎఫ్ చెల్లించేందుకు అనుమతించాలని కోరుతూ గతంలో పేరా 260) కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ రుజువును యజమాని ధ్రువీకరించాలి.
దరఖాస్తు కోసం త్వరలో ప్రత్యేకంగా లింకు(యూఆర్ఎల్)ను ఈపీఎఫ్వో అందుబాటులోకి తీసుకురానుంది. అది అందుబాటు లోకి వచ్చిన తరువాత ప్రాంతీయ కమిషనర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో పూర్తి చేసి.. డిజిటల్గా పంపించాలి. దరఖాస్తుదారుడికి (ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. యజమాని లాగిన్కు దరఖాస్తు చేరుతుంది. దానిపై డిజిటల్ సంతకం చేసి… తదుపరి పరిష్కారానికి ప్రాంతీయ కమిషనర్కు సమర్పించాలి.
ప్రతి దరఖాస్తును ప్రాంతీయ కమిషనర్ ఈ-ఫైల్ కింద నమోదు చేసి, సంబంధిత సెక్షన్ సూపర్వైజర్కు బదిలీ చేస్తారు. సెక్షన్ అధికారులు… పింఛను నిధిలో బకాయిలు, ఇతర రిమార్కులు ఏమైనా ఉంటే నమోదు చేసి, అదనపు పీఎఫ్ ” కమిషన! ర్ లేదా ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్కు అందజేస్తారు.
ప్రతి కేసును ప్రాంతీయ లేదా అదనపు పీఎఫ్ కమిషనర్ పరిశీలించి పరిష్కార వివరాల్ని దర ఖాస్తుదారుడికి ఈ-మెయిల్/పోస్టు లేదా ఫోన్/ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.
hi