Navaratnalu

  • Contact us

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక హామీ అమలు | Implementation of another key promise of Chief Minister Jagan

February 8, 2023 by bharathi Leave a Comment

ముఖ్యమంత్రి జగన్ బీసీలకు ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు నిర్ణయించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 95 శాతం పూర్తి చేసారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. బీసీ గర్జనలో చెప్పిన విధంగా ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తూ ప్రభుత్వం గజెట్ జారీ చేసింది. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలని చాలా ఏళ్లుగా కోరుతున్న నాయీ బ్రాహ్మణుల ఆకాంక్షను అమలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియా­మ‌కాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించేలా గజెట్ జారీ అయింది.

Implementation of another key promise of Chief Minister Jagan

చాలా ఏళ్లుగా ఆలయాల వ్యవస్థలో అర్చకు­లతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉంది. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారు. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలన్న నాయీ బ్రాహ్మ‌ణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన జగన్ పాదయాత్ర వేళ వివరించారు. దీనికి నాడు జగన్ సానుకూలంగా స్పందించారు. వైసీపీ నిర్వహించిన బీసీ గర్జనలోనూ దీని పైన చర్చ చేసారు. ఆ హామీ అమలు చేస్తానని జగన్ స్పష్టం చేసారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు అధికారికంగా అమలు కోసం గజెట్ జారీ చేసారు.

గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో దేవాదాయ పరిధిలోని అయిదు లక్షలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయలాలకు మాత్రమే బోర్డులు ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆలయాలు 1,234 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే బోర్డు నియామకాలు పూర్తయినవి మినహాయించి, భర్తీ చేయాల్సిన 610 ఆలయాలకు కొత్త పాలక మండళ్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం తాజాగా ఇంద్రకీలాద్రి, అన్నవరం, అరవసల్లి దేవాలయాలకు కొత్తగా పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. తాజాగా జారీ అయిన గజెట్ మేరకు ప్రతీ ఆలయంలోనూ ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ఈ దేవాలయ ట్రస్టు బోర్డులో స్థానం కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in