Jagan Sarkar’s key responsibilities for the staff of AP village and ward secretaries.. Now even in schools
Ap Grama Sachivalayam Employees కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా వారికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విధి విధానాలను కూడా విడుదల చేసింది. ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో పర్యవేక్షణ బాధ్యత సచివాలయాల సిబ్బందదే చూసుకుంటారు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ఈ వివరాలను అన్నింటిని నమోదు చేస్తారు. ఉద్యోగులకు అటెండెన్స్, భోజనంతో పాటూ మరికొన్ని బాధ్యతల్ని అప్పగించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధానాంశాలు:
- ఏపీలో సచివాలయాల సిబ్బందిక కీలక బాధ్యతలు
- స్కూళ్లలో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు
- ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో వివరాలు
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరికొన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తోంది జగన్ సర్కార్. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయించిన ప్రభుత్వం.. వాటిలో కొన్ని బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించింది. ఈ మేరకు విధివిధానాలను గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా విడుదల చేసింది.
సచివాయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్త, ప్రాథమిక వైద్యాధికారులు వివిధ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. సిబ్బంది తమ పరిధిలోని స్కూల్లో బోధనేతర కార్యక్రమాల పర్యవేక్షణను పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్లో ఆ వివరాలను నమోదు చేస్తారు.
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, లేని పక్షంలో వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు తమ పరిధిలోని స్కూళ్లలో కనీసం వారానికొకసారి సందర్శించి పిల్లల హాజరును పరిశీలించనున్నారు. ఒకవేళ విద్యార్థులకు హాజరు తక్కువగా ఉంటే.. వారి తలిదండ్రులతో మాట్లాడతారు. వంద శాతం హాజరు కోసం కృషి చేస్తారు. అవసరమైతే ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళతారు.
అంతేకాదు స్కూళ్లలో మధ్యాహ్న భోజన రికార్డులను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు పరిశీలిస్తారు. వీరు వారానికొకసారి స్కూల్ను సందర్శించిి.. మధ్యాహ్న భోజన రికార్డుల పరిశీలిస్తారు. అలాగే మెనూ ప్రకారం భోజనం రుచిగా, నీట్గా ఉందా అనేది ఆరా తీస్తారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే.. పేరెంట్స్ కమిటీతో కలిసి పరిష్కరిస్తారు.
ఇక ప్రతి నెలా ఏఎన్ఎంలు తమ పరిధిలోని స్కూళ్లను సందర్శించి.. పిల్లల పౌష్టికాహార పరిస్థితులను పర్యవేక్షిస్తారు. వ్యాధి నిరోధక టీకాలతో పాటు స్థానిక వైద్యాధికారి, ఆశా వర్కర్తో కలిసి పిల్లలకు వైద్య సహాయం అందిచనున్నారు. అంతేకాదు ప్రతి స్కూల్లో ఫిర్యాదులు ఇచ్చేందుకు ఓ బాక్సు ఏర్పాటు చేయనున్నారు. సచివాలయ మహిళా పోలీస్ ఈ ఫిర్యాదుల్ని పర్యవేక్షిస్ారు. స్కూళ్లలో విద్యార్థినులకు తరుచూ సమావేశాలు నిర్వహించి.. వారి భద్రతపై సమీక్షిస్తారు. నాడు–నేడు పనులను పేరెంట్స్ కమిటీ, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పర్యవేక్షించనున్నారు.
అంతేకాదు స్కూళ్లలో అవసరమైన మరమ్మతులను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గుర్తించి.. పేరెంట్స్ కమిటీ, ప్రధానోపాధ్యాయుల భాగస్వామ్యంతో పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. అలాగే మరుగుదొడ్ల పరిశుభ్రతపై నెలవారీ సమీక్ష బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించింది ప్రభుత్వం. ఇలా సచివాలయాల సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply